మనలో చాలా మందికి తెలుసు అరటి పండ్ల వల్ల చాలా లాభాలువున్నాయని. ఎన్నో ఆరోగ్య సమస్యలకు దీనిని ఒక ఔషధంగా వాడతారు. తాజాగా అరటి పండు, నీరు మిశ్రమం వల్ల కూడా చాలా లాభాలు వున్నాయన్ని కొన్ని పరిశోధనలలో నిరూపితమయింది.ఇంతకీ ఈ మిశ్రమం దగ్గు, దీర్ఘకాలిక సమస్యలను, శ్వాస సంబంధిత వ్యాధులను శక్తివంతంగా ఎదుర్కొంటుంది. ఇది పెద్ద వారికన్నా చిన్న వారిలో చాలా శక్తివంతంగా పని చేస్తుంది.
ఇంతకీ ఈ మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఒక సారి చూద్దాం.
ముందుగా అరటి పండు తొక్కను తీసేసి దంచి,ఆ తరువాత చక్కెర కలిపి కలిపాలి. ఆ తర్వాత వేడి నీటిని కలిపి 15 – 30 నిముషాలు పాటు ఉంచాలి. దీనికి తేనె కూడా కలుపుకోవచ్చు. కాని చల్లారిన తరువాత తేనె కలపాలి. వేడి గా వున్నప్పుడు తేనె ను కలిపితే తనలోని విశిష్ట గుణాలను కొల్పొతుంది.దీనిని రోజుకు 4 సార్లు తీసుకోవడం వల్ల జీర్ణాశయ సమస్యలుతో పాటు ,శ్వాస సంబధింత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు.

No comments:
Post a Comment