జలుబు మరియు దగ్గు వలన మనం ఎలా బాధపడుతామో తెలుసు వీటి నుండి మీకు త్వరగా ఉపశమనం పొందాలంటి ఈ క్రింది చిట్కాలను ఉపయోగించండి…
అల్లం మరియు టీ :
అల్లంను రోగనిరోధక శక్తి పెంచుకోటానికి మనం ఎక్కువగా వాడుతున్నారు. అల్లం చాలా సాధారణంగా మన ఇంట్లో ఉండే సహజ ఔషదం మరియు జలుబు, దగ్గులకు విరుగుగా పేర్కొంటారు. అల్లంతో చేసిన వేడి టీ ని తాగడం వల్ల జలుబు, దగ్గుల నుండి త్వరగా ఉపశమనం పొందుతారు.
పసుపు మరియు పాలు :
పసుపు కలిపిన పాలు మన భారతదేశంలో ప్రాముఖ్యం పొందిన ఔషదంగా పేర్కొనవచ్చు. పసుపు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను విస్తృతంగా కలిగి ఉంటుంది. కావున, దగ్గు లేదా జలుబు నుండి త్వరిత ఉపశమనం పొందుటకు పాలలో ఒక చెంచా పసుపు కలుపుకొని తాగండి.
వేడి నీరు :
ఇదొక సులభమైన పద్దతి వేడి నీటిని తాగడం . గోరువెచ్చగా ఉండే నీటిని తాగడం వల్ల గొంతు భాగంలో కలిగే ఇంఫ్లేషణ్ ను తగ్గిస్తుంది. రోజు మొత్తం తరుచుగా వేడి నీటిని తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు.
నిమ్మ మరియు తేనె :
నిమ్మరసానికి కొన్ని చుక్కల తేనె మరియు దాల్చిన చెక్క పొడి కలిపి తయారు చేసిన సిరప్ జలుబు నుండి త్వరగా ఉపశమనం అందిస్తుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి త్వరిత ఉపశమనం పొందుతారు.

No comments:
Post a Comment