పాతకాలం రోజులలో మన పెద్ద వాళ్ళు కూడా మనలాగే అదే నది నీరు గాని,అదే చెరువు నీరు గాని తాగే వారు. ఇప్పుడు మనం కూడా అదే నీరు తాగుతున్నాము. అయిన వారికి రాని జబ్బులు మనకు వస్తున్నాయి. కారణం కాలుష్యం..ఇంకెన్నో.కాని వీటిలో మనం ముఖ్యంగా ఫ్యాషన్ కోసం వదిలేసినవి కొన్ని. అందులో ముఖ్యమైనది వాటర్ ను స్టోర్ చేసి తాగే విధానం. ప్రస్తుతం మనం వాటర్ ప్లాస్టిక్ బాటిల్ లో వేసుకోని తాగుతున్నాం. అదే పూర్వం రాగి చెంబులో వేసుకోని తాగేవారు. అంతే కాకుండా మనం ఇప్పుడు జనరల్ వాటర్ తాగడం కూడా మానేసాం.
కేవలం మినరల్ వాటరే. వారు కూడా వాటర్ ప్యూర్ గా వుండడానికి కొన్ని కెమికల్స్ వాడుతున్నారని కొన్ని సర్వేలలో తేలింది. దీని వల్ల లాంగ్ రన్ లో క్యాన్సర్, కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్లగా మారతాయని కూడా వస్తాయని ఈ సర్వేలో తేలింది. అందుకే మనం మినరల్ వాటర్ తాగడం కన్నా జనరల్ వాటర్ తాగడమే మంచిదట. కాని మాములుగా ప్లాస్టిక్ బాటిల్ లో తాగడం కన్నా రాగి బిందెలు గాని , రాగి చెంబులు గాని ఉపయోగించి స్టోర్ చేసుకోని తాగాలంట. దీని వల్ల సూక్ష్మజీవులు చనిపోతాయట. అందుకే జనరల్ వాటర్ ను రాగి బిందెలలో పోసి తాగాలి అంటారు నిపుణులు…






