మనదేశంలో చాలా మందికి సగ్గు బియ్యం పై ఒక అపోహా వుంది. అదేమిటంటే సగ్గు బియ్యం మాంసాహారమని.కాని ఇంత మాత్రం నిజం కాదు. ఇప్పుడు వస్తున్నది దేవి నవరాత్రులు. అందువల్ల చాలా మంది ఉపవాసాలు వుంటారు.ఈ సమయంలో సగ్గు బియ్యం తినాలా వద్దా అని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్. సగ్గు బియ్యం అస్సలు మాంసాహారమే కాదు. ఇది అందరూ అనుకున్నట్లు ఈల్ చేపల నుంచి రావు. వీటిని పోలాలలో పండిస్తారు.ఇప్పుడు వీటిని ఎలా తయారు చేస్తారో చూద్దాం..
పోలాల నుండి సగ్గుబియ్యం వేరులతో సహా పీకి నీటిలో కడిగి,చర్మాన్ని తొలగించి,దంచుతారు. ఈ దంచంగా వచ్చిన పాలను ఒక టాంక్ లో 6 -12 గంటలు నిల్వ ఉంచి, టాంక్ పై భాగానికి చేరిన మలినాలను దూరం చేస్తారు. ఇప్పుడు నీటిని వదిలేసి , ఘన పదార్ధారంలో వున్న పాలను కిందకు వదిలేస్తారు. దీనిని యంత్రాల సహాయంతో గుండ్రని చిన్న చిన్న అణు రూపంలోకి మార్చి వడపోసి ఆవీరి పై వుంచి , ఆ పై సూర్య కాంతి కింద ఎండబెడతారు.సో ఇదీ పూర్తిగా శాకాహారం తో తయారు చేసినదే. ఎక్కడ మాంసాహారం తగలదు. సో సగ్గు బియ్యం ( సాభుదాన ) కచ్చితంగా శాఖాహరమే.

No comments:
Post a Comment